రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సాయంతో నిర్మల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ మినీట్యాంక్ బండ్పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు ఉన్న రోడ్డును మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
'మంత్రి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం' - నిర్మల్ పట్టణంలోని అభివృద్ధి పనులు తాజా వార్త
నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ తెలిపారు. నగరంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించారు.
'మంత్రి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం'
స్థానిక ఈదిగాం చౌరస్తా నుంచి శివాజీచౌక్ వరకు రూ. 3 కోట్లతో రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మల్ పట్టణాభివృద్ధికి మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గండ్రత్ రమణ, జహీర్, మున్సిపల్ ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశ మార్గాలు..