రాష్ట్రంలో దళితులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి బలవంతంగా లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు నేటితో 29వ రోజుకి చేరాయి.
దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమిని ప్రభుత్వం వెంటనే వారికి కేటాయించాలనీ, ఇల్లు లేని పేదలకు గృహ నిర్మాణం కోసం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.