తెలంగాణ

telangana

By

Published : May 11, 2020, 3:46 PM IST

ETV Bharat / state

'రైతు సంక్షేమంలో రాష్ట్రానిదే అగ్రస్థానం'

నిర్మల్​లోని దివ్యాగార్డెన్స్​​లో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ఖానాపూర్​ ఎమ్మెల్యే రేఖానాయక్​, జడ్పీ చైర్​ పర్సన్​​ విజయలక్ష్మి పాలాభిషేకం నిర్వహించారు. రైతుబంధు, రుణమాఫీ నిధులు మంజూరు చేసినందుకు గానూ... సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

minister indrakarn reddy said thank you to cm kcr for releasing funds
'రైతు సంక్షేమంలో రాష్ట్రానిదే ఆగ్రస్థానం'

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ... దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని సీఎం కేసీఆర్​ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కొనియాడారు. రూ.25 వేల లోపు పంట రుణాలమాఫీ, రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకుగానూ నిర్మల్​లో ముఖ్యమంత్రి​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో నిధులు విడుదల చేశార‌ని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ ఛైర్​పర్సన్​ విజయలక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. రైతులందరి తరఫున సీఎం కేసీఆర్​కు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

'రైతు సంక్షేమంలో రాష్ట్రానిదే ఆగ్రస్థానం'

ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details