తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో విద్యాభివృద్ధికి కేసీఆర్ కృషి: ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలం జామ్​ గ్రామంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదులకు... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

By

Published : Dec 21, 2020, 9:52 PM IST

minister indrakaran reddy inaugurate extra class rooms construction in jam nirmal district
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్​ కృషి: ఇంద్రకరణ్ రెడ్డి


నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో... అదనపు తరగతి గదులు, వసతుల ఉన్నతీకరణకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్​ ఎంతో కృషి చేస్తున్నారన్న మంత్రి... రూ.2.05 కోట్లతో విద్యాలయంలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్​ కృషి: ఇంద్రకరణ్ రెడ్డి

కరోనాతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉడేందుకు ప్రభుత్వం ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తుందని... విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ విజయలక్ష్మి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్ల వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్​లు రవీందర్ రెడ్డి, నర్మద, ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, తెరాస మండల కన్వీనర్ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది.. కేసీఆర్​: మంత్రి జగదీశ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details