తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది : ఇంద్రకరణ్​ రెడ్డి - Raithu Bheema Check Distribution Nirmal

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుదని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్​ జిల్లా నర్సాపూర్​ మండలం అంజనీతాండ గ్రామంలో జాదవ్​రావు అనే రైతు అనారోగ్యంతో మరణించగా... అతని భార్యకు రూ. 5 లక్షల రైతు బీమా చెక్కును మంత్రి అందజేశారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

By

Published : Jun 20, 2020, 7:29 PM IST

రైతులకోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్​ జిల్లా నర్సాపూర్​ మండలం అంజనీతాండ గ్రామంలో జాదవ్​రావు అనే రైతు అనారోగ్యంతో మరణించగా... అతని భార్య కలాబాయికి రూ. 5 లక్షల రైతు బీమా చెక్కును మంత్రి తన నివాసంలో అందజేశారు.

ప్రభుత్వం అందజేసే రైతు బీమా మరణించిన రైతు కుటుంబానికి ఆసరాగా ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతు పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు వెంకట్​రాం రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, నర్సాపూర్ జడ్పీటీసీ రామయ్య, అంజనీ తండా సర్పంచ్ జాదవ్ అంజనా బాయి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details