నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ సమీపంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు మహార్దశ వచ్చిందని మంత్రి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 500పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.