తెలంగాణ

telangana

ETV Bharat / state

జనంలోకి మావో దంపతులు

18 ఏళ్ల అజ్ఞాతవాసం వీడి ఇద్దరు మావోలు జనం బాట బట్టారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఓ దంపతులు సాధారణ జీవనం గడిపేందుకు ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలిశారు.

By

Published : Mar 1, 2019, 2:53 AM IST

Updated : Mar 1, 2019, 7:46 AM IST

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

నిర్మల్ జిల్లా మామడ మండలం బుర్కపల్లికి చెందిన మావోయిస్టులుసునీల్, గంగుబాయ్ అలియాస్ లత ఎట్టకేలకు జన జీవన స్రవంతిలో కలిశారు. 2001 నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఈ దంపతులు అజ్ఞాతం వీడారు.కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ ముందు లొంగిపోయారు. అజ్ఞాతం వీడి సాధారణ జీవితం గడిపేందుకు ముందుకొచ్చారని ఆయన తెలిపారు.జిల్లాలో ఇంకా నలుగురు మావోయిస్టులు ఉన్నారని, ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవాలని ప్రమోద్​కుమార్ సూచించారు.

Last Updated : Mar 1, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details