నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం మూటపూర్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాస్త సహనం కోల్పోయి ఆవేశంగా ప్రసంగించారు. పరిషత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి సభకు ప్రజలు ఎక్కువగా హాజరుకాలేదని కోపంతో ఊగిపోయారు. ఈ ఎన్నికల్లో మీ గ్రామంలో తెరాసకు మెజారిటీ రాకుంటే అభివృద్ధి పనులు నిలిపివేస్తానని హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులంతా చర్చించుకొని కారు గుర్తుకు ఓటేయాలని హుకూం జారీ చేశారు. మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడతారా అని ప్రజలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
" కారుకు ఓటేయకుంటే... పనులు నిలిపేస్తాం " - mantri-agraham
నిర్మల్ జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహనం కోల్పోయారు. కారు గుర్తుకు ఓటేయకుంటే గ్రామాభివృద్ధి పనులు జరగబోవని చెప్పటం చర్చనీయాంశమైంది.
![" కారుకు ఓటేయకుంటే... పనులు నిలిపేస్తాం "](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3198696-563-3198696-1557076924235.jpg)
కారు గుర్తుకు ఓటేయకుంటే ఇక అంతే