తెలంగాణ

telangana

ETV Bharat / state

'15 గొర్రెలపై పిచ్చి కుక్కల దాడి... రూ.50 వేల నష్టం' - Mudl_Pichi_Kukkula_Dhadi

అవి పిచ్చి కుక్కలు... తమ స్వైర విహారంతో గొర్రెల మందపై విచక్షరహితంగా దాడి చేశాయి. సుమారు 15 గొర్రెలను పొట్టనబెట్టుకున్నాయి. ఫలితంగా కాపరికి 50 వేల రూపాయల నష్టం జరిగింది.

గొర్రెల మందపై పిచ్చి కుక్కల దాడి... 15 గొర్రెలు మృతి
గొర్రెల మందపై పిచ్చి కుక్కల దాడి... 15 గొర్రెలు మృతి

By

Published : Dec 16, 2019, 9:41 PM IST

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. అర్ధరాత్రి సుమారు 15 మేకలపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. తన గొర్రెలు చనిపోవడం వల్ల కాపరి బోరున విలపిస్తున్నాడు. సంఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమపై పిచ్చి కుక్కలు దాడి చేస్తున్నాయని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామానికి చెందిన బాలుడిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన మరవకముందే ఇటీవలే ఉపాధి కోసం సౌదీ అరేబీయా వెళ్లొచ్చిన వ్యక్తి స్వదేశానికి వచ్చి జీవనోపాధి కోసం 50 గొర్రెలను, మేకలను పెంచుకుంటున్నాడు.

'నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి'

ఈ క్రమంలో అర్ధరాత్రి తన నివాస స్థలంలో ఉన్న మేకలపై పిచ్చి కుక్కలు దాడి చేయడం వల్ల 15 మేకలు చనిపోయాయి. సుమారు 50 వేల రూపాయల వరకు నష్టపోయానని బాధితుడు వాపోయారు. వెంటనే ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు. ఇప్పటికైనా గ్రామాన్ని పిచ్చి కుక్కల బారి నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

గొర్రెల మందపై పిచ్చి కుక్కల దాడి... 15 గొర్రెలు మృతి


ఇవీ చూడండి : పందుల పెంపకానికి చేయూత: తలసాని

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details