తెలంగాణ

telangana

బైక్​ను ఢీకొట్టిన లారీ.. యువకుడు మృతి

యూటర్న్‌ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల.. నిత్యం ఏదో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇలాగే బైక్​పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తుల్ని లారీ ఢీ కొట్టింది.

By

Published : Mar 8, 2021, 10:29 PM IST

Published : Mar 8, 2021, 10:29 PM IST

Larry hit the bike.. Young man killed in nirmal district center
బైక్​ను ఢీకొట్టిన లారీ.. యువకుడు మృతి

నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాల పాలైన బాధితుడు.. చికిత్స పొందుతూ ప్రాణలు విడిచాడు.

గాంధీ చౌక్​కు చెందిన బోనగిరి అంకుశ్ (23) తండ్రి సంజయ్​తో కలిసి.. బైక్​పై బైల్​ బజార్ నుంచి బస్టాండ్​ వైపునకు వెళ్తున్నాడు. యూటర్న్​ తీసుకొనే క్రమంలో.. లారీ వీరిని ఢీ కొట్టింది. ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అంకుశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు తండ్రి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అతి వేగంగా లారీ నడిపిన డ్రైవర్​ బషీర్ అహ్మద్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో 40 మేకలు మృతి..

ABOUT THE AUTHOR

...view details