తెలంగాణ

telangana

నిర్మల్​లో ఘనంగా దుర్గామాత నిమజ్జనం..

By

Published : Oct 25, 2020, 3:51 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలో ప్రతిష్టించిన దుర్గామాత శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. మహిళల మంగళహారతులు, బాజా భజంత్రీల నడుమ అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వినాయక్​సాగర్​లో నిమజ్జనం చేశారు.

Immersion of Goddess Durga in Nirmal ..
నిర్మల్​లో ఘనంగా దుర్గామాత నిమజ్జనం..

నిర్మల్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన శ్రీ దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రులు భక్తులచే విశేష పూజలందుకున్న అమ్మవారికి.. పట్టణవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.

కన్నుల పండువగా శోభాయాత్ర

ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని ప్రతిష్ఠించి.. మహిళలు మంగళహారతులు, బాజా భజంత్రీల నడుమ ఊరేగింపు నిర్వహించారు. శోభాయాత్ర సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పట్టణంలోని వినాయక్​ సాగర్​లో అమ్మవారిని నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి..జమ్మి చెట్టుకు ఎమ్మెల్యే ఆయుధ పూజ

ABOUT THE AUTHOR

...view details