నిర్మల్ జిల్లాలో పోలీసుల నిర్భంద తనిఖీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వారంరోజుల క్రితం మేడిపెల్లిలో ఎస్పీ శశిధర్ రాజు నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సరైన వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్లు లేకుండా వాహనాలను నడుతున్న100 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్థులకు చెట్లను కాపాడటం, రహదారి నిబంధనలపై అవగాన కలిపించారు. ప్రతి వాహనచోదకుడు వారం రోజుల్లో హెల్మెట్ ధరించి తమకు కనపడాలని వాగ్దానం చేయించారు. అందుకు తగ్గట్లుగా ఆ గ్రామస్థులు మాట నిలబెట్టుకున్నారు.
మాట ఇచ్చారు.. హెల్మెట్ ధరించారు - మాట ఇచ్చారు.. హెల్మెట్ ధరించారు
నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజుకు మేడిపల్లి గ్రామస్థులు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అది ఏంటని అనుకుంటున్నారా? గ్రామంలో పచ్చదనంతో పాటు ప్రతి వాహనచోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎస్పీతో పాటు ర్యాలీ నిర్వహించారు.
![మాట ఇచ్చారు.. హెల్మెట్ ధరించారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5155755-1100-5155755-1574511304086.jpg)
మాట ఇచ్చారు.. హెల్మెట్ ధరించారు
గ్రామంలోని వాహన చోదకులంతా హెల్మెట్ ధరించి మేడిపెల్లి గ్రామం నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వీరిని ఎస్పీ అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని పరిరక్షించాలని సూచించారు.
మాట ఇచ్చారు.. హెల్మెట్ ధరించారు
ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం