నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయం వద్ద దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ విజయ లక్ష్మీ, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ముందున్న జమ్మి చెట్టుకు పూజలు జరిపారు.
నిర్మల్లో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మంత్రి - దసరా వేడుకలు 2020 వార్తలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు.
నిర్మల్లో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మంత్రి
ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం దసరా ఉత్సవాలను మరింత ఆకర్షణీయంగా జరుపుకునేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి:పెద్దల నిబంధనకు కట్టుబడి.. పండుగలు చేసుకోని ఓ గ్రామం