నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో బుధవారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా పంచాయతీ కార్యాలయ ఆవరణలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం కొందరు పనోళ్లు మద్యం కావాలని అడగ్గా.. సర్పంచ్ భర్త ఇప్పించారని వార్డు మెంబర్ తెలిపారు. కార్యాలయం బయట మద్యం తాగుతుండగా వర్షం రావడం వల్ల వారు ఆఫీస్లోకి వచ్చారు. ఆ సమయంలో సర్పంచ్ భర్త అక్కడే ఉన్నామని.. ఈ క్రమంలో కొందరు వచ్చి వీడియో తీశారని పేర్కొన్నారు.
ఇదంతా వ్యతిరేక వర్గీయులు కావాలనే చేస్తున్నారని... కొందరు ఉదయం నుంచి బెదిరిస్తున్నారని సర్పంచ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు.