తెలంగాణ

telangana

ETV Bharat / state

అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - latest news on Distribution of food under the direction of Ayyappa Seva Samiti

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే విషు పూజను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలకు ఆహారం పంపిణీ చేశారు.

Distribution of food under the direction of Ayyappa Seva Samiti
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

By

Published : Apr 15, 2020, 12:47 PM IST

శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి ఏటా ఏప్రిల్‌ 14న విషు పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలోనూ గత 10 సంవత్సరాలుగా అయ్యప్ప విషు పూజ, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు.

లాక్‌డౌన్‌ దృష్ట్యా భక్తులెవరినీ ఆలయాల్లోకి అనుమతించకపోవడం వల్ల స్వామివారికి నిర్వహించాల్సిన విషు పూజ, పడి పూజలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ కూడళ్లలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు పులిహోర ప్యాకెట్లను అందజేశారు.

ఇదీ చూడండి:-'లాక్​డౌన్​ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'

ABOUT THE AUTHOR

...view details