నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం కూష్మాండ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
వైభవంగా శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు - నిర్మల్ జిల్లా వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. దేవి దర్శనానికి భక్తులు తరలొస్తున్నారు.
![వైభవంగా శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు devi navarathri ustaval in basara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9241520-399-9241520-1603176048355.jpg)
నాలుగో రోజుకు చేరుకున్న శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు
ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రలతో అమ్మవారికి 'అల్లం వడలు(గారెలు)' నైవేద్యంగా సమర్పించారు. అమ్మవార్లకు కుంకుమార్చన, హారతితో విశేష పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఇదీ చూడండి:నమ్మకంగా పనిచేస్తారు.. మత్తుమందిచ్చి ఇళ్లంతా దోచేస్తారు