నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో పదేళ్లుగా ఉంటున్న ఓ ఆవును గ్రామస్థులంతా భక్తి శ్రద్ధలతో కొలిచేవారు. అనారోగ్య కారణాలతో ఆ గోవు ఇవాళ మరణించింది. తామంతా భక్తి భావంతో కొలుచుకునే గోవుకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్య క్రతువులు నిర్వర్తించారు ఆ గ్రామస్థులు.
శాస్త్రోక్తంగా గోమాత అంత్యక్రియలు - nirmal
ఎద్దుల బండిపై మృత కళేబరాన్ని ఊరంతా ఊరేగించారు. సంప్రదాయ బద్దంగా భౌతికకాయానికి స్నానాధి క్రతువులు నిర్వహించి రుద్రభూమికి తీసుకెళ్లారు. అంతిమ యాత్రకు ఊరంతా తరలివచ్చారు. పండితుడి వేద మంత్రోచ్ఛరణలతో మృత దేహాన్ని ఖననం చేశారు. ఇదంతా సాధారణమే అనుకుంటున్నారా.. ఈ తంతు జరిగింది నిర్మల్జిల్లా కుబీర్ ప్రాంత వాసులు దైవంగా భావించే ఓ గోమాతకు.

ఆవు అంత్యక్రియలు
గోవు కళేబరానికి స్నానం చేయించి, కాషాయ వస్త్రం కప్పి ఎడ్లబండిపై మేళతాళాలతో ఊరేగించారు. చిన్నా పెద్దా అంతా గోమాతకి జై అంటూ నినదిస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పండితుడి వేద మంత్రాల నడుమ అంత్యక్రియలు జరిపారు.
గోమాతకు అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు
ఇదీ చదవండి : తొలిసారి గ్రేడింగ్ విధానంలో ఏపీ ఇంటర్ ఫలితాలు