తెలంగాణ

telangana

ETV Bharat / state

'తప్పనిసరిగా సీటుబెల్ట్, హెల్మెట్లు ధరించండి'

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు చెట్లను కాపాడాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సూచించారు.

By

Published : Oct 29, 2019, 1:04 PM IST

నిర్మల్ జిల్లాకేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని మేడిపల్లి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 96 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనచోదకులు తప్పనిసరిగా సీటు బెల్ట్, హెల్మెట్లు ధరించాలని ఎస్పీ శశిధర్ రాజు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటి వాటిని బాధ్యతగా పెంచి... భావితరాలకు ప్రాణవాయువును అందించాలని పేర్కొన్నారు.

నిర్మల్ జిల్లాకేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details