నిర్మల్ జిల్లా కేంద్రంలోని జహురానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. మృతి చెందిన వ్యక్తి ఇటీవల దిల్లీలో జరిగిన మత ప్రచార సభలో పాల్గొన్నారు. అనారోగ్యంతో వెళ్లి చికిత్స పొందుతూ మృతి చెందడం వల్ల కరోనా అయి ఉండొచ్చని అనుమానాలు తలెత్తాయి.
కరోనా కాలనీగా వీధి పేరు.. ఎవరూ బయటికెళ్లొద్దని హెచ్చరిక - latest news on Colony Quarantine .. Warnings that no one will go out in nirmal district
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. మృతుడు దిల్లీలో ఇటీవల జరిగిన మత ప్రచార సభలో పాల్గొన్నాడు. ఫలితంగా కరోనా వల్లే మరణించి ఉంటాడని అనుమానించిన అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని ఓ కాలనీ మొత్తాన్ని కరోనా కాలనీగా ప్రకటించారు.

కాలనీ దిగ్బంధం.. ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు
ఫలితంగా జిల్లా పాలానాధికారి ముషారఫ్ అలీ ఫారూకీతో పాటు రెవెన్యూ, వైద్య, పోలీస్ అధికారులు మృతుడి కాలనీని సందర్శించారు. కాలనీలో క్లోరినేషన్ చేపట్టారు. మృతుడి కుటుంబీకులను 8మందిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు తరలించారు. కాలనీ మొత్తాన్ని దిగ్బంధం చేసి... కరోనా కాలనీగా ప్రకటించారు. కాలనీవాసులు ఎవరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీచేశారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాలనీ దిగ్బంధం.. ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు
ఇదీ చదవండి:ఆ సొరంగంలో నడిస్తే కరోనా వైరస్ హతం