నిర్మల్ జిల్లా ముథోల్లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో ఉన్న అపరిశుభ్రతను చూసి ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్పై ఆగ్రహం - జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు
నిర్మల్ జిల్లా ముథోల్లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలను జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణం అపరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం చేపట్టి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు.
![కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్పై ఆగ్రహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5086828-177-5086828-1573914458406.jpg)
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్పై ఆగ్రహం
పాఠశాల ఆవరణ ఇంకోసారి అపరిశుభ్రతగా కనిపిస్తే ప్రిన్సిపల్పై చర్యలు తీసుకుని మెమోలు జారీ చేస్తానని హెచ్చరించారు. స్థానిక నాయకులు పాఠశాల కొత్త భవనం గురించి కలెక్టర్కు విన్నవించగా.. నిధులు మంజూరు అయ్యేటట్లు చూస్తామని ఆమె తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్పై ఆగ్రహం
ఇదీ చూడండి: విద్యార్థులు ఇద్దరు.. అయ్యవార్లు అసలే లేరు!
TAGGED:
collector sudden checks