తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే పెరుగుతున్న కేసులు' - corona news

కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ అన్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరారు.

corona news
nirmal district

By

Published : Apr 5, 2021, 4:41 PM IST

నిర్మల్ జిల్లాలో కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోందని కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముందస్తు చర్యగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 100 పడకల క్వారెంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజల్లో అవగాహన పెంచడానికి విస్తృత ప్రచారం కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరారు.

ఇదీ చదవండి:రనౌట్ కోసం డికాక్‌ ట్రిక్- మాజీల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details