తెలంగాణ

telangana

ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% సాధారణ ప్రసవాలు జరగాలి: నిర్మల్​ కలెక్టర్​

నిర్మల్ జిల్లాలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో యాభై శాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసిన ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

By

Published : Nov 8, 2020, 1:39 PM IST

Published : Nov 8, 2020, 1:39 PM IST

Updated : Nov 8, 2020, 2:24 PM IST

collector musharaf sharukhi meeting on Deliveries Held in private hospitals in nirmal district
ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% సాధారణ ప్రసవాలు జరగాలి: నిర్మల్​ కలెక్టర్​

నిర్మల్​ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై సమావేశం నిర్వహించారు. ఆకార్యక్రమంలో కలెక్టర్​ ముషర్రఫ్​ షారుఖీ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రులలో 50శాతం సాధారణ ప్రసవాలు కచ్చితంగా జరగాలని ఆయన వైద్యులను ఆదేశించారు. గర్భిణీలకు, కుటుంబ సభ్యులకు ఆపరేషన్ల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు.

ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆసుపత్రులు, వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసమావేశంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా. ధన్​రాజ్, డాక్టర్లు కార్తీక్, రజిని, ఆశిష్, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కలెక్టరేట్​ను ముట్టడించిన ఎమ్మార్పీస్​ కార్యకర్తలు

Last Updated : Nov 8, 2020, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details