ఎల్ఆర్ఎస్తో ఎటువంటి ప్రయోజనం లేదని, ఇప్పటికే కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను మరింత పీడించడానికే కేసీఆర్ సర్కార్ ఈ విధానాన్ని తీసుకొచ్చిందని భాజపా నేతలు ఆరోపించారు. వెంటనే ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పేద ప్రజలను పీడించడానికే ఎల్ఆర్ఎస్ విధానం:భాజపా - Layout Regularisation Scheme in telangana
కేసీఆర్ సర్కార్.. భూ క్రమబద్ధీకరణ పేరుతో ప్రజలను రోడ్డున పడేసి ఎత్తుగడలను ప్రదర్శిస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎల్ఆర్ఎస్ విధానానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు.
నిర్మల్లో భాజపా నేతల దీక్ష
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎల్ఆర్ఎస్ విధానానికి వ్యతిరేకంగా భాజపా నేతలు దీక్ష చేపట్టారు. ఈ విధానం వల్ల పేదప్రజలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యన్నగారి భూమయ్య, రావుల రామ్నాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, స్థానిక కమలం నేతలు పాల్గొన్నారు.