నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగాం వద్ద భాజపా నేతలు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద మాటేగాం నుంచి కుంటాల మండలం లింబాబి వరకు రహదారి మంజూరైంది. ప్రోటోకాల్ ప్రకారం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేరును శిలాఫలకంలో ఐదో స్థానంలో వేశారంటూ భాజపా నేతలు ఆందోళన చేపట్టారు.
శిలాఫలకంపై ఎంపీకి ప్రాధాన్యత ఇవ్వరా: భాజపా - నిర్మల్ జిల్లాలో భాజపా నేతల రాస్తారోకో
ప్రోటోకాల్ పాటించడం లేదంటూ నిర్మల్ జిల్లా మాటేగాం వద్ద భాజపా నేతలు రాస్తారోకో నిర్వహించారు. రహదారి నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరుచేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేరును ఐదోస్థానంలో రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శిలాఫలకంపై ఎంపీకి ప్రాధాన్యత ఇవ్వరా: భాజపా
రహదారి నిర్మాణానికి బాపూరావు.. రూ.9 కోట్లు మంజూరుచేశారని ముధోల్ ఎంపీటీసీ తెలిపారు. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:ఆర్థిక లోటు భర్తీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని విన్నపం