తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2022, 4:30 PM IST

ETV Bharat / state

ఉత్సాహంగా నిర్మల్​జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర

Bandi Sanjay Prajasagrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. నిర్మల్ జిల్లాలోని చిట్యాల్ గ్రామంలో బండికి బీజేపీ కార్యకర్తలు స్వర్ణవాగులో నుంచి తెప్ప ద్వారా ఘన స్వాగతం పలికారు.

బండి సంజయ్
బండి సంజయ్

Bandi Sanjay Prajasagrama Yatra: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. నిర్మల్‌ జిల్లాలోని చిట్యాల్ గ్రామ బ్రిడ్జి వద్ద బండికి బీజేపీ నాయకులు స్వర్ణ వాగులో నుంచి తెప్ప ద్వారా స్వాగతం పలికారు. సంజయ్‌ వారికి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు.

రహదారిపై వెళ్తోన్న బస్సు ఎక్కి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. బీజేపీని ఆదరించాలని కోరారు. అనంతరం మంజులాపూర్‌లోని శివాజీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details