తెలంగాణ

telangana

ETV Bharat / state

విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న అల్లోల - telangana news

తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్​ పెద్దపీట వేశారని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివకోటి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఆలయానికి రూ.50 లక్షల నిధులు కేటాయించామని.. ఆలయ అభివృద్ధి పనులకు మరో 15 లక్షలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

Allola indrakaran reddy participated in installation programme at nirmal
విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న అల్లోల

By

Published : Dec 28, 2020, 7:10 PM IST

రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం బుధవార్​పెట్​లోని శివకోటి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహా సంస్థాన పీఠాధిపతులు జగద్గురు పుష్పగిరి శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ఆలయానికి పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు.

శివాలయానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షల నిధులు కేటాయించామని.. ఆలయ అభివృద్ధి పనులకు మరో 15 లక్షలు నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. శివకోటి మందిరం ద్వారా బుధవార్​పెట్ చౌరస్తాకు కొత్త శోభ వచ్చిందన్నారు.

శివలింగాన్ని బెనారాస్​లో, పీఠాన్ని మహాబలిపురంలో శిల్పులతో ప్రత్యేకంగా తయారు చేయించామని మంత్రి అన్నారు. బంగల్​లెట్​లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రూ.కోటితో త్వరలోనే అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దేశంలోనే రెండో కోతుల పునరావాస కేంద్రాన్ని నిర్మల్​లో ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్మల్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. చైన్ గేట్ నుంచి బంగల్​పెట్ వరకు రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

ఇదీ చూడండి:పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ రబ్బర్ స్టాంప్ : ఆర్. కృష్ణయ్య

ABOUT THE AUTHOR

...view details