రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం బుధవార్పెట్లోని శివకోటి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహా సంస్థాన పీఠాధిపతులు జగద్గురు పుష్పగిరి శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ఆలయానికి పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు.
శివాలయానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షల నిధులు కేటాయించామని.. ఆలయ అభివృద్ధి పనులకు మరో 15 లక్షలు నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. శివకోటి మందిరం ద్వారా బుధవార్పెట్ చౌరస్తాకు కొత్త శోభ వచ్చిందన్నారు.