నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని నాయబాది కాలనీకి చెందిన 14సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. ఈ బాలిక ముధోల్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు ఈ నెల 14న జర్వం రావటంతో తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర వైద్యపరీక్షలు చేయించాడు.
వసతి గృహానికి వెళ్లిన బాలిక అదృశ్యం - 9th Class girl missing in Mudhol nirmal district
నిర్మల్ జిల్లా ముధోల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వసతి గృహానికి వెళ్లిన బాలిక అదృశ్యం
మంగళవారం ఉదయం వసతిగృహానికి వెళ్తానని చెప్పిన బాలిక అదృశ్యమైంది. తండ్రి అబ్దుల్ సలీమ్ ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.