తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నుంచి కోలుకున్న 97 ఏళ్ల బామ్మ - 97 years oldage woman saved from corona in nirmal district

ఆత్మ విశ్వాసం, ధైర్యం ఉంటే ఎలాంటి వ్యాధినైనా జయించగలమని నిరూపించింది 97 ఏళ్ల బామ్మ. కరోనా మహమ్మారి బారిన పడి భయాందోళనలకు గురవుతూ, తమ శరీరంలో ఉన్న ఇతర వ్యాధుల కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో కొవిడ్​ను జయించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది ఈ బామ్మ.

old women
కరోనాను జయించిన 97 ఏళ్ల బామ్మ

By

Published : May 1, 2021, 3:11 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో నివసించే గంప భాగీరథ(97) కరోనా మహమ్మారిని జయించారు. పట్టణంలోని ప్రియదర్శినీనగర్ కాలనీకి చెందిన గంప శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో అందరూ పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ పాజిటివ్​ నిర్ధరణ కావడంతో భాగీరథ ఆరోగ్యంపై మొదట ఆందోళన చెందారు.

వైద్యులు సూచించిన మందులు వాడుతూ ఆమె జాగ్రత్తలు పాటించారు. గురువారం రోజున మరోసారి కరోనా పరీక్షలు చేయించగా అందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. 97 ఏళ్ల వయసులోను ఏ మాత్రం అధైర్యపడకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడి మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ఇదీ చదవండి:లోకల్ ఆన్‌లైన్ యాప్‌.. ఉపాధి కల్పిస్తున్న సోదరద్వయం

ABOUT THE AUTHOR

...view details