నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం నిడుగుర్తి గ్రామానికి చెందిన రుక్మిణి (24) మూడో కాన్పు నిమిత్తం జిల్లా కేంద్రానికి అంబులెన్స్లో బయలుదేరించి. నొప్పులు ఎక్కువ కావడం వల్ల మార్గమధ్యలో ఆంబులెన్స్లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆంబులెన్స్లో ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం - woman delivered in an ambulance
కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న గర్భిణి ఆంబులెన్స్లోనే ప్రసవించిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో చోటుచేసుకుంది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆంబులెన్స్ సిబ్బంది తెలిపారు.
![ఆంబులెన్స్లో ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం woman gave birth to a child in an ambulance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9282989-462-9282989-1603442577964.jpg)
ఆంబులెన్స్లో ప్రసవం
అంబులెన్స్ సిబ్బంది తల్లీబిడ్జలను నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలపగా.. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.