తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకేసారి రెండు పండుగలు.. జిల్లా ఎస్పీ సూచనలు - పండుగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

వినాయక నిమజ్జనం, మొహర్రం పండుగల సందర్భంగా నారాయణపేట జిల్లా ఊట్కూరులో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Two festivals at once narayanpet District SP Instructions police staff
ఒకేసారి రెండు పండుగలు.. జిల్లా ఎస్పీ సూచనలు

By

Published : Aug 30, 2020, 5:32 AM IST

నారాయణపేట జిల్లా ఊట్కూరులో 200 మంది పోలీసులతో వినాయక నిమజ్జనం, మొహర్రం పండుగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన ఉట్కూర్​లో సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులు గణేష్ నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె పలు సూచనలు చేశారు.

నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసులు విధులు నిర్వర్తించే సమయంలో సంయమనం పాటించాలన్నారు. ఎక్కడ డ్యూటీ అయితే అక్కడే ఉండి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, పికెట్స్, పెట్రోలింగ్, మండపాల దగ్గర మొదలగు విధులు నిర్వర్తించే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న సందర్భంగా విధులు నిర్వర్తించే పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా సిబ్బంది మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. విధులు నిర్వర్తించే సమయంలో పై అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అలజడులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఇదీ చూడండి :తల్లి, అన్నను తుపాకీతో కాల్చి చంపిన మైనర్ బాలిక

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details