తెలంగాణ

telangana

ETV Bharat / state

మరికల్​ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తోన్న పారిశుద్ధ్య సమస్య - marikal residents suffering with sanity problems

దినదినాభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నారాయణపేట జిల్లా మరికల్​ పట్టణంలో పారిశుద్ధ్య సమస్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వర్షం వస్తే చాలు ఇళ్లలోకి నీరు చేరుతోంది. ప్రయాణికుల ప్రాంగణం.. పందులు, దోమలకు నిలయంగా మారగా.. ఏళ్లుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై 'ఈటీవీ భారత్​' ప్రత్యేక కథనం.

many development problems in marikal
మరికల్​ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తోన్న పారిశుద్ధ్య సమస్య

By

Published : Oct 3, 2020, 2:19 PM IST

నారాయణపేట జిల్లా కేంద్రానికి మరికల్​ పట్టణం 30 కి.మీ దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు మరికల్​ మీదుగానే జిల్లా కేంద్రాన్ని చేరుకోవాలి. ఏటా ఇంటిపన్నుల ద్వారా గ్రామపంచాయతీకి రూ. 20.40 లక్షల ఆదాయం వస్తుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మరో రూ.యాభై లక్షలు వస్తోంది. ఇలా ఏటా వస్తున్న రూ.70 లక్షలతో శాశ్వతమైన పారిశుద్ధ్య సమస్యలను అధికారులు పరిష్కరించలేకపోతున్నారు.

సమస్యల పుట్టగా పట్టణం..

మరికల్​లో సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడం, అంతర్గత రహదారులు శిథిలమై గుంతలు పడటం, గుంతల్లో నిలిచిన మురుగు నీటిలో దోమల నిలయంగా మారింది. పందుల స్వైరవిహారంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలతో రోగాల బారిన పడుతున్నామని.. పెరగుతున్న వరాహాల సంఖ్యకు అడ్డుకట్టవేయక అవి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. వాన కురిస్తే అడుగు తీసి బయట పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు.

పట్టణంలోని ప్రయాణికుల ప్రాంగణం ఎదుట మురికికుంట, మాదారం రోడ్డులో అంతర్గత రహదారుల సమస్యలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని వాపోతున్నారు. బస్టాప్​ ఉన్నా అక్కడ పందులు తప్ప... కనీసం మరుగుదొడ్లు, తాగునీటి వసతి, క్యాంటిన్​ లేకపోవడం దురదృష్టకరమని ప్రయాణికులు భావిస్తున్నారు.

వారు పట్టించుకోకే..

ప్రయాణికుల ప్రాంగణంలో వ్యాపార సముదాయాలను నిర్మించినా ఏటా లక్షల్లో వచ్చే ఆదాయాన్ని సైతం ఆర్టీసీ అధికారులు దృష్టి సారించట్లేదని.. ఇందువల్ల సరైన సౌకర్యాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారన్నారు. మరికల్ పట్టణాన్ని.. దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు.. త్వరలోనే పట్టణంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని సర్పంచ్​ గోవర్ధన్​ తెలిపారు.

ఇదీ చదవండి:'అటల్​ టన్నెల్​.. సరిహద్దుల్లో ప్రపంచస్థాయి సొరంగమార్గం'

ABOUT THE AUTHOR

...view details