తెలంగాణ

telangana

ETV Bharat / state

కోస్గిలో రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ

కొడంగల్ ప్రజలు నాటిన మొక్క దిల్లీ వరకు ఎదిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గిలో కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు.

By

Published : Jul 20, 2019, 12:09 AM IST

రేవంత్​ రెడ్డి

నారాయణపేట జిల్ల కోస్గిలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. కొడంగల్​లో ప్రజలు ఓడించినా ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు మల్కాజిగిరికి వచ్చి కొడంగల్ ప్రజలు చేసిన తప్పును మీరు చేయొద్దంటూ ప్రచారం చేశారని రేవంత్​ తెలిపారు. కొడంగల్ ప్రజలు నాటిన మొక్క దిల్లీ వరకు ఎదిగిందన్నారు. గతంలో ఈ ప్రాంతానికి వచ్చి కొడంగల్​ను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పిన హరీశ్​ రావు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

కోస్గిలో రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details