"ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి" - cmo osd
నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో నిర్మించనున్న రైల్వేస్టేషన్ పరిసరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో నిర్మించనున్న నూతన రైల్వే స్టేషన్ పరిసరాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మెుక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. మక్తల్ నుంచి దేవరకద్ర మధ్య 30 కిలోమీటర్ల పొడవునా నిర్మాణమవుతున్న రైల్వే ట్రాక్కు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి మీరు ఉన్న పరిసరాలను హరిత వనాలుగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.