తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లికి పుట్టిలో వెళ్లాడు.. శవమై తేలాడు!

ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చుసింది. శుభకార్యానికంటూ వెళ్లిన వ్యక్తి శవమై తిరిగిరావటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

By

Published : Dec 21, 2020, 8:16 PM IST

person belongs to narayanpet district died in krishna river
పెళ్లికని వెళ్లి శవమై తేలాడు

నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మృతి చెందాడు. బంధువుల గ్రామానికి పుట్టిలో వెళ్లిన గుంటప్ప తిరిగి రాకపోయేసరికి..ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మేరకు కర్ణాటక రాష్ట్రం నది ఒడ్డున బాధితుడి మృతదేహం లభ్యమైంది.

ఏం జరిగిందంటే...

ముస్లైపల్లి గ్రామనికి చెందిన పాలెం గుంటప్ప(45).. ఈనెల 18న బంధువుల వివాహం నిమిత్తం కర్ణాటకలోని ఓ గ్రామానికి, కృష్ణానది తీరం గుండా పుట్టి వేసుకొని బయలుదేరారు. రెండు రోజులు గడిచినా అతను ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనుమానంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మేరకు కర్ణాటక సరిహద్దుల్లో బాధితుడి మృతదేహం లభ్యమైంది. శుభకార్యానికంటూ వెళ్లిన గుంటప్ప శవమై తిరిగిరావటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి:పెన్నానదిలో ఏడుగురు గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం

ABOUT THE AUTHOR

...view details