అంబేడ్కర్ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం దామరగిద్ద మండలానికి చెందిన కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో కొందరు యువకులు అంబేడ్కర్ జయంతి సందర్భంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచందన హాజరయ్యారు.
అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి - అంబేద్కర్ జయంతి సందర్భంగా యువకులు రక్తదానం చేశారు.
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నారాయణ పేట జిల్లా ఆసుపత్రిలో యువకులు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రక్తదానం చేశారు.

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి