తెలంగాణ

telangana

వలస కార్మికులకు అండగా నిలిచిన తహశీల్దార్​

By

Published : May 18, 2020, 6:08 PM IST

స్వస్థలానికి కాలినడకన పయనమైన వలసకార్మికులకు నారాయణపేట జిల్లా మాగనూర్​ తహశీల్దార్​ అండగా నిలిచాడు. జిల్లా కలెక్టర్​తో మాట్లాడి ప్రత్యేక వాహనంలో స్వస్థలానికి పంపిస్తామని భరోసానిచ్చారు. కూలీల యజమానితో మాట్లాడి న్యాయ చేపిస్తామని తెలిపారు.

maganur mro help to odissa migrants
వలస కార్మికులకు అండగా నిలిచిన తహశీల్దార్​

నారాయణపేట జిల్లా మాగనూర్​లో ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికులు కాలినడకన స్వస్థలానికి పయనమయ్యారు. ఒడిశాకు కార్మికులు గత కొంత కాలంగా ఇటుక బట్టిల్లో పనిచేస్తున్నారు. లాక్​డౌన్ పొడిగింపు కారణంగా... ఇన్ని రోజులు వేచి చూసిన కార్మికులు కాళ్లనే నమ్ముకుని తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

సుమారు ఆరు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ప్రభుత్వాధికారులు, పోలీసులు కలుగజేసుకుని వలస కార్మికులను మాగనూర్ తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. పరిస్థితిని తెలుసుకున్న తహశీల్దార్​ రమేశ్​... ఇటుకబట్టీల యజమానితో మాట్లాడతానని కార్మికులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్​ అనుమతి తీసుకుని రెండు మూడు రోజుల్లో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు

ABOUT THE AUTHOR

...view details