తెలంగాణ

telangana

ఆదేశాలు వచ్చేవరకు.. విత్తనాలు అమ్మరాదు : కలెక్టర్

By

Published : May 19, 2020, 10:41 PM IST

ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు మిల్లర్లు, డీలర్లు రైతులకు విత్తనాలు అమ్మకూడదని నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరి చందన ఆదేశించారు. ఈ మేరకు ఆమె డీలర్లు, విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వరి, మొక్కజొన్న విత్తనాలు తప్ప ఇతర విత్తనాలు అమ్ముకోవచ్చని సూచించారు.

Dealers Will Not Sell Corn And Paddy Seeds Till Government Announcement
ఆదేశాలు వచ్చేవరకు.. విత్తనాలు అమ్మరాదు : కలెక్టర్

నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన 2020 ఏడాది వ్యవసాయ పంటల ప్రణాళికపై జిల్లా మిల్లర్లు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు వరి, మొక్కజొన్న విత్తనాలు అమ్మరాదని డీలర్లను ఆదేశించారు.

కందులు, పత్తి, నూనెలకు సంబంధించిన పంటల విత్తనాలు అమ్ముకోవచ్చని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి నాణ్యమైన విత్తనాలు తెచ్చుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు.

ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details