తెలంగాణ

telangana

ETV Bharat / state

గొడ్డళ్లతో తల నరికి... మెుండం వేరుచేసి.. - DOG SQUAD AT SPOT

నారాయణపేట జిల్లాలోని లక్ష్మీపూర్​లో దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుడి తల, మెుండం వేరుచేసి భయోత్పాతం సృష్టించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్​తో పరిశీలిస్తున్నారు.

నారాయణపేట జిల్లాలో ఘోర హత్య
నారాయణపేట జిల్లాలో ఘోర హత్య

By

Published : Apr 20, 2020, 7:15 PM IST

Updated : Apr 20, 2020, 8:29 PM IST

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం లక్ష్మీపూర్​లో దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు. గోపాల్​ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా చంపేశారు. గొడ్డళ్లతో నరికి తలను వేరు చేశారు. తెల్లవారుజామున సమాచారం అందుకున్న నారాయణపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నారాయణ పేట సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ చంద్ర మోహన్ హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు. గ్రామంలో మృతుడికి ఎవరితోనూ విరోధం లేదని గ్రామస్థులు తెలిపారు.

Last Updated : Apr 20, 2020, 8:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details