తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కేటీఆర్ పిలుపుతో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. తెరాస ఆవిర్భవించిందే ప్రత్యేక రాష్ట్ర సాధనకని మంత్రి చెప్పారు.
కొవిడ్-19 నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. రాజకీయాలు చేసేందుకు ఇది సందర్భం కాదని... ఆకలితో ఉన్న వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సూచించారు.