తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ జీవోలు జారీ అయ్యేవరకు పోరాటం ఆగదు'

నారాయణ పేట జిల్లా మక్తల్​లో అఖిలపక్ష నేతలు ఎల్ఆర్​ఎస్ కు వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

By

Published : Dec 21, 2020, 3:57 PM IST

all parteis demands lrs abolish in narayanpet
'ప్రభుత్వ జీవోలు జారీ అయ్యేంతవరకూ పోరాటం ఆగదు'

ఎల్ఆర్​ఎస్​ రద్దును డిమాండ్​ చేస్తూ..నారాయణపేట జిల్లా మక్తల్​లో అఖిలపక్ష నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ భూములకు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్​ చేయడానికి వీలు కల్పిస్తూ.. ప్రభుత్వం జీవోలు జారీ చేసేంతవరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ సభ్యులు ఆశిరెడ్డి, భాజపా నాయకులు స్వామి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసుధన్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం'

ABOUT THE AUTHOR

...view details