నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామ సమీపంలో బియ్యంలోడ్ తో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ను తప్పించబోయి ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది.
నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి - నారాయణపేట జిల్లాలో బియ్యంలోడ్ లారీ బోల్తా
మరికల్ మండలంలో లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో.. ఒకరు మృతి చెందారు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన జనార్దన్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Accident in Narayanpet District One Die
ఈ దుర్ఘటనలో లారీ డైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన జనార్దన్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ