మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించేందుకు పాఠశాల ఆవరణలోనే కూరగాయల సాగు చేపట్టారు ఉపాధ్యాయులు. ఆరెకరాల స్థలంలో నిమ్మ, కొబ్బరి పంటలతో పాటు కూరగాయలు సాగు చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు నల్గొండజిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి జడ్పీహెచ్ ఉపాధ్యాయులు.
వనరులు వాడకం అంటే ఇలా ఉండాలి
గతంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నర్ర రాఘవ రెడ్డి స్ఫూర్తితో గ్రామస్థులంతా కలిసి ఆరెకరాల స్థలం సేకరించి పాఠశాలకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ స్థలాన్ని లీజుకివ్వడం ద్వారా ఆదాయం వచ్చేది. కొన్నేళ్లుగా ఇక్కడ వంగ, బీర తదితర కూరగాయలు సాగుచేస్తూ మధ్యాహ్న భోజననానికి అవసరమైన పంటలు పండిస్తున్నారు ఉపాధ్యాయులు. వాటితో పాటు నిమ్మ, కొబ్బరి చెట్ల నుంచి కూడా ఆదాయం లభిస్తోంది. పంటల వల్ల పాఠశాల వాతావరణం ఆహ్లదంగా ఉండడమే కాకుండా ఆదాయం కూడా వస్తుందంటున్నారు ఉపాధ్యాయులు.
అందరూ బాధ్యతగా