తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈరోజు మీరు బస్సులు నడపొద్దు.. వెళ్లిపోండి' - నల్గొండ డిపో నుంచి బయటకు రాని బస్సులు

బస్సులు నడిపేందుకు వచ్చిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను బస్సులు నడపొద్దని వేడుకుంటూ వెనక్కి పంపించేస్తున్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు.

'ఈరోజు మీరు బస్సులు నడపొద్దు.. వెళ్లిపోండి'

By

Published : Oct 22, 2019, 9:41 AM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18వ రోజూ కొనసాగుతోంది. వేకువ జాము నుంచే కార్మికులు పట్టణంలో బస్సు డిపో వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బస్సులను రోడ్లపైకి రానివ్వబోమని అడ్డుకున్నారు. బస్సులు నడిపేందుకు వచ్చిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు.

'ఈరోజు మీరు బస్సులు నడపొద్దు.. వెళ్లిపోండి'

ABOUT THE AUTHOR

...view details