నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 45వ రోజూ కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ నెల 19న ఆర్టీసీ ఐకాస సడక్ బంద్కు పిలుపు నిచ్చింది. రేపటి సడక్ బంద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేస్తున్నారు.
సడక్ బంద్ నిర్వీర్యానికి నేతల ముందస్తు అరెస్ట్లు - tsrtc workers protest police arrests in nalgonda
ఈ నెల 19న సడక్ బంద్ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనకుండా ఉండేందుకు నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేపడుతున్నారు.
![సడక్ బంద్ నిర్వీర్యానికి నేతల ముందస్తు అరెస్ట్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5101812-369-5101812-1574073955946.jpg)
సడక్ బంద్ నిర్వీర్యానికి నేతల ముందస్తు అరెస్ట్లు
ఉదయం నుంచే కార్మికులను, అఖిలపక్ష నాయకులను అరెస్టే చేసి వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లకి తరలించారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
సడక్ బంద్ నిర్వీర్యానికి నేతల ముందస్తు అరెస్ట్లు
ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్కు మహిళ.. భర్తపై ఫిర్యాదు