నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు.
బదిలీలు, పదోన్నతులు కల్పించాలి: కోదండరాం - కోదండరాం తాజా వార్తలు
ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు పలికారు.

బదిలీలు, పదోన్నతులు కల్పించాలి: కోదండరాం
రాష్ట్రం ఏర్పడిన నుంచి ఉపాధ్యాయుల ప్రమోషన్లు.. నాలుగు సంవత్సరాల నుంచి బదిలీలు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి బదిలీలపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 2018 పీఆర్సీ కూడా అమలు కాలేదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!