ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన ఆర్టీసీ కార్మికులు... బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. ఇప్పటికైనా వారి డిమాండ్లు నెరవేర్చాలని సూచించారు. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా... నల్గొండ ప్రయాణ ప్రాంగణానికి చేరుకొని మద్దతు తెలిపారు. 30న జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ సిబ్బంది... కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.
'ఆత్మహత్యలు వద్దు... పోరాటమే ముద్దు'
నల్గొండలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెజాస అధ్యక్షుడు కోదండరాం మద్దతు తెలిపారు. ఇప్పటికైనా సీఎం వారి డిమాండ్లను నెరవార్చాలని కోరారు.
'ఆత్మహత్యలు వద్దు... పోరాటమే ముద్దు'