ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన వివాహ వేడుకకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం యానాంలో పర్యటించారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు.. మంత్రి జగదీశ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణారావు ఫౌండర్గా ఉన్న వృద్ధాశ్రమం, అనాథ బాలల ఆనంద నిలయం, రక్త నిధి, బేబీ కేర్ కేంద్రాలను సందర్శించారు. నిర్వహణ అద్భుతంగా ఉందని జగదీశ్రెడ్డి కితాబిచ్చారు.