నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు ఆసుపత్రులపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా పేషంట్లకు ఉపయోగించే ఔషధ నిల్వలను, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంపై పరిశీలన చేశారు.
మిర్యాలగూడలో ఆసుపత్రులపై టాస్క్ఫోర్స్ దాడులు - మిర్యాలగూడ తాజా వార్తలు
కొవిడ్ పేషెంట్కి రెండు రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు రూ.70 వేలు వసూలు చేశారనే ఫిర్యాదుతో టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. మిర్యాలగూడలోని పలు ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు.
![మిర్యాలగూడలో ఆసుపత్రులపై టాస్క్ఫోర్స్ దాడులు Task force raids on hospitals, Miryalaguda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:10:42:1620636042-tg-nlg-190-10-hospitals-taskforce-dadulu-av-ts10146-10052021132557-1005f-1620633357-87.jpg)
Task force raids on hospitals, Miryalaguda
పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న కోణార్క్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి ఓ కొవిడ్ పేషెంట్ చనిపోయాడు. అతనికి రెండు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు వేసి రూ.70 వేలు వసూలు చేశారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కరోనా రోగుల చికిత్సపై ప్రభుత్వ విధి విధానాలను విస్మరించి.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: వైద్యశాఖలో తాత్కాలిక నియామకాలకై కసరత్తు ముమ్మరం