తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2021, 6:19 PM IST

ETV Bharat / state

'కేసీఆర్ సభతో... నోముల భగత్ విజయం ఖాయం'

సాగర్​లో కేసీఆర్ సభతో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఎన్నికల ఇన్​ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలిపారు. ఈనెల 14న కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

takkallapalli-ravinder-rao-inspected-the-cms-public-meeting-premises-in-sagar
'కేసీఆర్ సభతో... నోముల భగత్ విజయం ఖాయం'

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ... నియోజకవర్గ పరిధిలోని అనుములలో ఈనెల 14న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఎన్నికల ఇన్​ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు పరిశీలించారు.

కేసీఆర్ సభ ఈనెల 14న సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్నట్లు రవీందర్ తెలిపారు. ఈ సభతో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పేరుకు మాత్రమే బరిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. రోడ్డుమార్గం, ట్రాఫిక్​కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సాగర్​ అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details