నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మన్నెం వెంకన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. చిట్యాల పోలీసులు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని.. అది కొట్టేయకుంటే దూకేస్తానని బెదిరించాడు. టవర్ చివరివరకు ఎక్కి ఎంతసేపైనా దిగకపోవడం వల్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దింపేందుకు యత్నించారు. బాధితుని బంధువులు సెల్టవర్ దిగమని వెంకన్నను ప్రాధేయపడుతున్నారు.
కేసు కొట్టేస్తారా..సెల్టవర్ పైనుంచి దూకేయాలా..! - సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
పోలీసులు తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని.. లేకపోతే దూకేస్తానని ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగింది.

సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం